బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదు:మంత్రి చిదంబరం

ఢిల్లీ : బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ…. విదేశాలతో మనం జరిపే లావాదేవీలపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తొలుత ఆహార భద్రత అర్డినెస్స్‌పైనే చర్చ జరుగుతుందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 కంటే ఎక్కువగానే ఉందని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.