ఆగంతుకుల కాల్పులకు గురైన కేంద్ర మంత్రి

కోల్‌కతా: కేంద్ర మంత్రి అబూ హసెం ఖాన్‌ చౌధురిపై ఆగంతుకులు కాల్పులు జరిపారు. అయితే ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని సురక్షితంగా ఉన్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆగంతుకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన కారుపైకి బాంబులు కూడా విసిరారు. వారు ఐదుసార్లు కాల్పులు జరిపారని అదృష్టవశాత్తూ మంత్రి తప్పించుకున్నారని అక్కడి నేతలు తెలిపారు. భయాందోళనలతో ప్రజలు పరుగులు తీయడంతో ర్యాలీ అర్థాంతరంగా అగిపోయింది.