బుద్ధగయ పేలుళ్ల కేసులో అనుమానితుడి చిత్రం విడుదల

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో పది రోజుల క్రితం జరిగిన వరుసు పేలుళ్ల కేసులో అనుమానితుల ఛాయాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా ఒక వ్యక్తి చిత్రం విడుదల చేశామని, దీన్ని ఆధారంగా చేసుకుని సీసీటీవీ పుటేజిని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికీ సీసీటీవీ పుటేజి స్పష్టంగా లేదని, బౌద్ధ సన్యాసులు ధరించే దుస్తుల్లో ఉన్న అనుమానితుడు ఇక్కడి వ్యక్తో కాదో స్పష్టంగా తెలియడం లేదని వారు పేర్కొంటున్నారు.