ఢిల్లీ పోలీసు కమిషనర్గా భీమ్సేన్ బస్సీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి భీమ్సేన్ బస్సీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ నీరజ్కుమార్ జులై 31న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో బస్సీని ఈ స్థానంలో నియమించారు. 1977 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన బస్సీ గోవా డీజీపీగా పనిచేశారు. 2011లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ (టాఫిక్ విభాగం) గా నియమితులయ్యారు.