అనిల్‌ అంబానీకి సమన్లపై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సాక్ష్యమిచ్చేందుకు అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు సమన్లు జారీ చేయాలని సీబీఐ దాఖలు చేసిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు జూలై 19కి వాయిదా వేసింది.
అనిల్‌ అంబానీ, టీనా అంబానీలతో పాటు పలువురిని ప్రాసిక్యేషన్‌ సాక్షులుగా కోరుతున్నామని ప్రత్యేక కోర్టుకు సీబీఐ మంగళవారం తెలిపింది. 2 జీ స్పెక్ట్రం అడ్డగోలు కేటాయింపుల వ్యవహారంలో రిలయన్స్‌ అడాగ్‌ ప్రమేయంపై ఆ కంపెనీ అధికారులను ప్రశ్నించినా సరైనా సమాధానం రాలేదని న్యాయస్థానానికి సీఈఐ విన్నవించింది. అందువల్లే అనిల్‌, టీనా అంబానీలను సాక్షులుగా విచారించాలనుకుంటున్నామని వెల్లడించింది.