స్వయంప్రతిపత్తిపై సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): స్వయం ప్రతిపత్తికి సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐని మరోసారి ఆదేశించింది. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు అంశాలను ఎవరితోను పంచుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేయండని చెప్పింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తుతే తమ వద్దకు రండని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది.