కారుపై చెట్టు విరిగిపడటం వల్ల నలుగురు మృతి
మహారాష్ట్ర: నాగర్సోల్ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. నాగర్సోల్ నుంచి షిరిడీ వైపు వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో నరసరావుపేటలో విషాదఛాయలు అలమకున్నాయి.