యాసిడ్ దాడులపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితులకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాలను సుప్రీకోర్టు ఆదేశించింది. యాసిడ్ దాడి బాధితులకు 15 రోజుల్లో రూ. లక్ష చెల్లించాలని పేర్కొంది. యాసిడ్ దాడి జరిగిన వెంటనే బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.