ఐడీకార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గుర్తింపు కార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యాసిడ్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో రూ. లక్ష నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది.