ఢిల్లీ చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

ఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిల పర్యటకు ప్రాధాన్యం ఏర్పడింది.