వార్‌రూమ్‌ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలపై హస్తినాలో వాడీవేడి చర్చ జరుగుతుంది. ఓ పక్క సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుంటే, మరో పక్క తెలంగాణపై తేల్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో రాష్ట్రానికి చెందిన సీఎం, డిప్యూటీ సీఎం, బొత్సలతో అధిష్ఠాన పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణపై ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.