చత్తీస్‌గఢ్‌ పీసీసీమ అధ్యక్షుడిగా చరణ్‌దాన్‌ మహంత్‌

ఢిల్లీ: చత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కేంద్రమంతి చరణ్‌దాస్‌ మహంత్‌ నియమితులయ్యారు. రెండు నెలల క్రితం జరిగినమ మావోయిస్టుల దాడిలో చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడితో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌నేతలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీతో పాటు, ఎన్నికల కమిటీ, సమన్వయ కమిటీలను అధిష్ఠానం నియమించింది.