ప్రారంభమైన యూపీఏ సమన్వయ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ భేటీ షురూ అయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు , యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు పలువురు యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలకు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, శరద్‌పవార్‌, చిదంబరం, ఫరూక్‌ అబ్దుల్లా, అజిత్‌సింగ్‌, కమల్‌నాథ్‌, ముస్లింనేత అహ్మద్‌ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు.