జనార్ధన్‌ ద్వివేదితో టీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్ధన్‌ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల భేటీ ముగిసింది. తెలంగాణ నిర్ణయం జరిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఎంపీలకు ద్వివేది చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పండి అని సూచించారు. ఎవరూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దు అని కోరారు. ఇరు ప్రాంతాల నేతలు పూర్తి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.