తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో రగులుతుంది: బీపీఎఫ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో రాజ్య విభజనపై చర్చ కొనసాగుతుంది. ఈ సంద్భంగా అస్సాంకు చెందిన బీపీఎఫ్‌ పార్టీ నేత బిస్వజిత్‌ దాల్మరి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో రగులుతుందని గుర్తు చేశారు. చిన్ని రాష్ట్రాల డిమాండ్లను కూడా పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు.