నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి : భారతీయస్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 340.13 పాయింట్లు కోల్పోయి 17905.91 వద్ద నిఫ్టీ 98.90 పాయింట్లు నష్టపోయి 5302.55 వద్ద ముగిశాయి. భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,గెయిల్‌, టాటాపవర్‌.. తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి. భారతీఎయర్‌టెల్‌, సన్‌ఫార్మా స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.