రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. 2జీ కుంభకోణానికి సంబంధించిన జేపీసీలో కేంద్రప్రభుత్వం ఈరోజు రాజ్యసభకు చెందిన మరో ఇద్దరు సభ్యులను నియమించింది. కాంగ్రెస్‌ సభ్యుడు పి. భట్టాచార్య నామినేటెడ్‌ సభ్యుడు అశోక్‌ గంగూలీలను ప్రభుత్వం జేపీసీలో నియమించింది. ఈ నియామకం పట్ల భాజపా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.