భారత్ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): కాశ్మీర్లని టాంగ్ధర్ సెక్టార్లోకి చొరడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. టాంగ్ధర్ సెక్టార్లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పులో నలుగురు ఉగ్రవాదులు మృతి చందారు. టాంగ్ధర్ సెక్టార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వైపులా నుంచి హోరాహోరిగా కాల్పులు జరిగాయి. రెండు రోజుల క్రితం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను పోలీసులు అదుపులోకి తాసుకున్న విషయం విదితమే.