భవనం కూలి నలుగురి మృతి

ఒడిశా: ఒడిశాలోని పురాతన భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ,ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాలు తొలగించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా నానడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.