కాంకేర్‌లో బాంబు పేలుడు: జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు గాయాలయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ తొలివిడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.