ఇరు వర్గాల మధ్య కాల్పులు : ఇద్దరి మృతి

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతలోని పార్క్‌ స్ట్రీట్‌ వద్ద ఆస్తి వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.