వాస్తవాధీన రేఖ వద్ద పాక్‌ ఆర్మీ చీప్‌ పర్యటన

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ లో కొత్తగా ఆర్మీ చీఫ్‌ పదవిలో నియమితులైన జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ మంగళవారం ఇరు దేశాల సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద పర్యటించారు. ఇటీవల ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నులకొంటున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆర్మీ చీఫ్‌ ఎల్‌ఓసీ ప్రాంతానికి వచ్చారు. అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సైనికులు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారని పాకిస్థాన్‌ టెలివిజన్‌ పేర్కొంది.