నవంబర్‌లో 7.52 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : నవంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదైంది. గత నెలో ఇది 7 శాతం ఉండేది. కూరగాయలు ముఖ్యంగా బంగాళాదుంప, ఉల్లిపాయల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని చూపింది. గోధుమలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు 19.93 శాతం పెరిగాయని టోకు ధరల సూచీ పేర్కొంది.