చిరుధాన్యాల సాగుపై అవగాహన: రాజశేఖర్ గౌడ్

చిలప్ చెడ్, (జనంసాక్షి) : రైతు వేదిక నందు ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మొదటగా చిరుధాన్యాల సాగు వాటి ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రముఖ శాస్త్రవేత్త బి అనిలాకుమారి శిక్షణ కార్యక్రమం, వేసవిలో కూరగాయ సాగు గూర్చి కూరగాయల శాస్త్రవేత్త శ్రీ ప్రీతం గౌడ్ శిక్షణ కార్యక్రమం, ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ శ్రీ అల్తాస్ జానయ్య ప్రసంగం, పంట వ్యర్ధాల కాల్చడం ద్వారా జరిగే నష్టాలు గూర్చి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఉమా రెడ్డి ప్రసంగం, మిర్చి పంటల యాజమాన్య పద్ధతులు వాటి సాగుకు సంబంధిత సందేహాలను గూర్చి రైతులతో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్ గారి ముఖాముఖి, చివరగా భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే ప్రారంభించడం జరుగును. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట రాజశేఖర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారినీలు కృష్ణవేణి ,దివ్యశ్రీ , ఎక్స్ వైస్ ఎంపీపీ విష్వంబర్,పరశురాం రెడ్డి ,సుభాష్ రెడ్డి మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు