ప్చ్.. బాబుకు మళ్లీ నిరాశే..!!
ఢిల్లీ, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం విచారణ జరపనున్నట్టు వెల్లడిరచింది. హైకోర్టుకు సమర్పించిన ధ్రువపత్రాలను ఆలోగా అందివ్వాలని సీఐడీ తరపు న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే చంద్రబాబు తరపు సుప్రీం కోర్టు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, అసలిది ఈ కేసుకు వర్తిస్తుందా లేదా అన్నది ప్రధాన అంశమని పేర్కొన్నారు. ట్రాప్ కేసు తప్ప మిగతా ఆరు రకాల ఆరోపణలకు 17ఏ వర్తిసుందని, 2015 నుంచి 2019వరకు ఆరోపణలు ఉన్నాయని వివరించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మళ్లీ వాయిదా వేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.