శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 25 (జనం సాక్షి):

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

తిమ్మరాయిన్ పహాడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుద్దిల్ల

శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ పండుగ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మండలంలోని తిమ్మరాయిని పహాడ్ గ్రామంలో తన మిత్రులైన పూదోట సురేష్ కుమార్, సుధీర్ కుమార్ ఇంటి వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తో కలిసి బుధవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. అంతేకాక ఏసుక్రీస్తు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరి పై ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఐక్యతతో క్రిస్టియన్లు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన మిత్రులు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్, జిల్లా కార్యదర్శి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్ రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, యూత్ మండల అధ్యక్షులు బండి హరీష్, మాదారపు చరణ్, నరిశెట్టి సతీష్, పూదోట నవీన్ కుమార్, సునీల్ కుమార్, బోటర్, తదితరులు పాల్గొన్నారు.