కొండా సురేఖపై పరువు నష్టం కేసు

మంత్రి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేయాల్సి ఉన్నది. అయితే వాగ్మూలం ఇచ్చేందుకు కేటీఆర్‌ సోమవారం కోర్టుకు హాజరవుతారని తెలుస్తున్నది. సెక్షన్‌ 356 బీఎన్‌ఎస్‌ ప్రకారం కేటీఆర్‌ వాంగ్మూలం కీలకంగా మారనుంది.ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంత విడాకులపై నిరాధార ఆరోపణలు చేసిన వీడియో క్లిప్పింగ్‌లు, సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలు, పత్రికల్లో వచ్చిన వార్తలను నిక్షిప్తం చేసిన పెన్‌డ్రైవ్‌ను, ఫొటోలను సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు.