పట్టింపు లేని విద్యుత్ అధికారులు
చిలప్ చేడ్, (జనంసాక్షి) :- మండలంలోని పలు గ్రామాలలో చాలాచోట్ల విద్యుత్తు స్తంభాలపై పిచ్చిమొక్కల తీగలు అల్లుకొని విద్యుత్తు ప్రసారాలకు ఆటంకాలు కలుగుతున్న అధికారులు మాత్రం పట్టింపు లేనట్టు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అక్కడక్కడ పిచ్చిమొక్కల చెట్లు పెరిగి విద్యుత్తు తీగలకు అంతరాయం కలిగిస్తున్నా పట్టించుకోవడం లేదని ఫైజాబాద్ గ్రామ ప్రజలు వాపోతున్నారు.చిలప్ చేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో బండాపోతుగల్ వెళ్లే ప్రధాన చౌరస్తా వద్ద విద్యుత్తు స్తంభం కనిపిచకుండా పిచ్చి మొక్కలు చుట్టూ ముట్టేసిన స్థానిక లైన్ మెన్ గాని, పైఅధికారులు గాని విద్యుత్తు స్తంభంపై దృష్టి సారించకపోవడం శోచనీయం,వర్షం పడితే ఆ పరిసరాల్లో విద్యుత్తు అర్తింగ్ అవుతూ పశువులకు,అక్కడ ఉండే ప్రజలకు ప్రమాదం జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు.దీంతో ఈదురు గాలులు,వర్షాల వల్ల చెట్ల నుంచి ఇళ్లకు కూడా విద్యుత్తు సరఫరాపై ప్రభావం చూపిస్తుందని స్థానికులు అంటున్నారు.దీనిపై సంబంధిత పై అధికారులు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్తంభం చుట్టున్న పిచ్చి మొక్కలను తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.