నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం
` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌
` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై ఏసీబీ నోటీసుకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ ద్వారా సమాధానం పంపారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ చర్యను అంగీకరించేది లేదని తెలిపినట్లు సమాచారం. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్‌ తన న్యాయవాదులతో చర్చించారు. అనిశా అధికారులు ఆదేశించినట్లుగా మొబైల్‌ ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు కేటీఆర్‌కు చెప్పినట్టు సమాచారం.