మిస్‌వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరి

` పోటీల్లో గెలుపొందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ
` 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేసిన గత సంవత్సర విజేత క్రిస్టినా పిజ్కోవా
` 3వ,2వ,1వ రన్నర్‌ అప్‌లుగా మార్టినిక్‌, పోలెండ్‌, ఇథియోపియా భామలు
` టాప్‌-8 నుంచి నిష్క్రమించిన మిస్‌ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్‌
` ఫైనల్‌ పోటీలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ఉత్కంఠగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని సుచాతా చువాంగ్‌కు ధరించారు. 3వ రన్నర్‌ అప్‌ గా మిస్‌ మార్టినిక్‌, 2వ రన్నర్‌ అప్‌గా మిస్‌ పోలెండ్‌, 1వ రన్నర్‌ అప్‌గా ఇథియోపియా నిలిచారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు.. రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ అందనుంది. సుచాత.. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు..హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు అట్టహాసంగా జరిగాయి ఈ పోటీల్లో టాప్‌-8 నుంచి మిస్‌ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్‌ అయ్యారు. టాప్‌ 8మందిలో మార్టినిక్‌, బ్రెజిల్‌, ఇథియోపియా, నమిబియా, పోలెండ్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌ నిలిచాయి. ఖండాల వారీగా టాప్‌ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్‌ లిస్ట్‌ చేస్తున్నారు. నువ్వు మిస్‌ వరల్డ్‌ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం ఇస్తున్నారు. కంటెస్టెంట్‌ల సమాధానాలకు జడ్జిలు మార్కులు వేశారు. అంతకుముందు బాలీవుడ్‌ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిగాయి మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాల భామలు పోటీ పడిన విషయం తెలిసిందే.ఫైనల్‌ పోటీలకు జడ్జిలుగా జడ్జిలుగా.. జూలియా మోర్లీ, సోనూ సూద్‌, సుధా రెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్‌ రంజన్‌, మనూషి చిల్లర్‌, నమ్రత శిరోద్కర్‌, డోనా వాళ్ష్‌ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్‌లు ఆకట్టుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్న ప్రభాకర్‌, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.