అక్రమ మొరం తరలింపును అడ్డుకున్న ఎమ్మార్వో

నిజంసాగర్ అక్టోబర్ 18 (జనంసాక్షి) అక్రమంగా మొరం తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మార్వో బిక్షపతి అన్నారు. ఆయన గురువారం నాడు మండలంలోని మల్లూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తరలింపును అడ్డుకున్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లి హిటాచి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మొరం అడ్డుకున్నారు ఆయన మాట్లాడుతూ ఎంతటి వారైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని లేనియెడల అక్రమంగా మొరం తరలింపుకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.