డీజే సౌండ్‌కు ఆగిన గుండె

కామారెడ్డి : గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న నరేష్‌ (35) డీజే చప్పుళ్లకు గుండెపోటుతో మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు.