మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఛాన్స్
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..
` నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన జి.వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి
` రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి.వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్ఠానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్కుమార్ (మాదిగ), బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించారు. గడ్డం వివేక్ చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో తెరాస(ప్రస్తుతం భారాస)లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో తెరాస నుంచి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో మళ్లీ వివేక్ తెరాసలో చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత భాజపాలో చేరారు. 2023లో మళ్లీ కాంగ్రెస్లో చేరిన వివేక్.. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు వంశీ గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి
అడ్లూరి లక్ష్మణ్ను ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచారు. భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 2,229 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1968లో ఆయన కరీంనగర్ జిల్లాలో జన్మించారు. పెద్దపల్లి కళాశాలలో ఐటీఐ పూర్తి చేశారు. 1986-1994 మధ్య కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996-2001 మధ్య ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో ధర్మారం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010-2012 మధ్య కరీంనగర్ జడ్పీ ఛైర్మన్గా పనిచేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు, 2010 ఉపఎన్నికలో ఓడారు. 2013-14 మధ్య ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్గా పనిచేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
వాకిటి శ్రీహరి రాజకీయ నేపథ్యమిది
ఎమ్మెల్యే అయిన తొలిసారే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. ఆయన 1972లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. భారాస అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,522 ఓట్ల తేడాతో గెలిచారు. 2014-2018 మధ్య మక్తల్ జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2001-2006 మధ్య మక్తల్ సర్పంచిగా ఉన్నారు. నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శిగా పని చేశారు.
మైనార్టీలకు దక్కని మంత్రి పదవి
విస్తరణలో మైనార్టీలకు మొండిచేయి
నాడు ఎన్టీఆర్, గతంలో కేసీఆర్ ఒకే ఒక్కరితో ప్రమాణం
బషీరుద్దీన్ బాబుఖాన్, మహమూద్ అలీకి మొట్టమొదటి ప్రాధాన్యత
మజ్లిస్ ఒత్తిడి వల్లనే కాంగ్రెస్ కేబినెట్లో ముస్లింలకు నో ఛాన్స్..!?
ప్రాతినిథ్యం లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు నష్టమని విశ్లేషకుల భావన
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపు మర్లడం ఓ ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. 2014 నుంచి 2018 ఎన్నికల వరకు పదేళ్ల పాటు బీఆర్ఎస్తో మైనార్టీ ఓటర్ ఉన్నాడు. రాష్ట్రంలో 14శాతం ఉన్న మైనార్టీ ఓటర్లు గంపగుత్తగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రధాన పట్టణాలు, నగరపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడిరదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రను సింహావలోకనం చేస్తే 1983`1984లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనతో పాటు ఒకే ఒక్క మంత్రితో కలిసి ప్రమాణం చేశారు. ఆయనే బషీరుద్దీన్ బాబుఖాన్..!
2018లో రెండవసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకే ఒక్క మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రమాణం చేశారు. ఎన్టీఆర్, కేసీఆర్ మైనార్టీల ప్రాధాన్యతను గుర్తించి తనతో పాటు ఇంకో మంత్రిని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ హయాంలో షబ్బీర్ అలీ, ఫరీదుద్దీన్కు ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించడం వారి ప్రాధాన్యతను తెలియజేస్తోంది. అయితే, రాష్ట్రంలో ఒకే ఒక్క కులాన్ని లెక్కించినప్పుడు ప్రధాన ఓటరుగా మైనార్టీలు ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. రాష్ట్ర జనాభాలో అంతటి ప్రాధాన్యత గల వర్గాన్ని విస్మరించి ఇప్పటికే దాదాపు రెండేళ్ల పాలన పూర్తికావొస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలోనైనా మైనార్టీలకు చోటు దక్కుతుందని అందరూ భావించారు. మొదట రాష్ట్రంలో ఒక్క మైనార్టీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీకి రాకపోవడం, మండలిలో కూడా కాంగ్రెస్లో ప్రాతినిథ్యం లేకపోవడంతో మొదటి మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు చోటుదక్కలేదు. ఆ తర్వాత సియాసత్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆమెర్ అలీఖాన్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని పరిశీలకులు భావించారు. కానీ, మజ్లిస్ పార్టీ ఒత్తిడి వల్ల కాంగ్రెస్ మంత్రివర్గంలో స్థానం లభించలేదని తెలుస్తోంది. ఏదేమైనా మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిథ్యం లేకపోవడం మున్ముందు తెలంగాణలో కాంగ్రెస్కు తీరని నష్టం మిగల్చనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
దత్తాత్రేయ అజాత శత్రువు
` నా స్కూల్ భాజపాలో, కాలేజీ తెదేపాలో.. ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద.. :సీఎం రేవంత్రెడ్డి
` పదవి ఉన్నా లేకున్నా ఆయనపై ఏమాత్రం గౌరవం తగ్గదు
` ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి
` దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం
హైదరాబాద్(జనంసాక్షి): పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
శిల్పకళావేదికలో జరిగిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసినా దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు.‘’గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. నా స్కూల్ చదువు భాజపాలో, కాలేజీ చదువు తెదేపాలో.. ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నా అని ఇటీవల ప్రధానికి చెప్పాను. నాకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడు దాచుకోను. మంత్రివర్గ విస్తరణ ఉన్నా.. ఆ కార్యక్రమం అవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చాను. ఆయన అజాత శత్రువు’’ ‘’జాతీయ రాజకీయాల్లో వాజ్పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి, విధానాల నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలి. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది’’అని అన్నారు.
మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చుపుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ఛలోక్తి విసిరారు. ఈ వేదిక గవర్నర్ల పరేడ్లా ఉందన్నారు. కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఈ వేదికపైనే ఉందని, తాను మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు.
2.అవకాశం రాని అసంతృప్తులను బుజ్జగించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం
` మంత్రిపదవి దక్కని నేతలను సమాధానపరుస్తున్న కాంగ్రెస్ నాయకత్వం
` పదవి దక్కపోవడానికి గల కారణాల వివరణ
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశకు లోనైన ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇవాళ ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. ఈ మధ్యాహ్నం రాజ్భవన్లో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగించాలని నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల దృష్ట్యా మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్మీట్ వాయిదా వేసుకున్నారు.మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే కచ్చితంగా సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగింది. రాత్రి పొద్దు పోయే వరకు కూడా సుదర్శన్రెడ్డితో పాటు మరో ఇద్దరు నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఆయన పేరు మిస్ అయింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సుదర్శన్రెడ్డిని బుజ్జగించేందుకు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో మంత్రి వర్గంలో అవకాశం రాకుండా పోయిందో ఆయనకు మీనాక్షి నటరాజన్ వివరించినట్లు తెలుస్తోంది. కేవలం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక జరిగినట్లు వివరించారని సమాచారం. అనంతరం నేతలు అక్కడినుంచి బేగంపేటలోని ప్రేమ్సాగర్ రావు నివాసానికి వెళ్లారు.