రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడతాం

` తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అడుగులు
` 2047 నాటికి 3 ట్రిలియన్‌ ఎకానవిూ లక్ష్యం
` పదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
` ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న వ్యవస్థలు
` ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతూ వస్తున్నాం
` రాష్ట్రాన్ని గాడిన పెట్టడం నల్లేరుపై నడక కాదని తెలుసు.
` దశాబ్దాల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం
` కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యం
` హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
` 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ
` సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం పంపిణీ
` వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ
` తెలంగాణ అవతరణ దినోత్సవంలో సిఎం రేవంత్‌ రెడ్డి

ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేపట్టాం. ప్రభుత్వ వసతిగృహం విద్యార్థులకు డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచింది. ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువస్తాం. పేదల ఆరోగ్యం కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. దేశంలో దాదాపు వందేళ్ల క్రితం కులగణన జరిగింది. వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యతో కేంద్రంలో కూడా కదలిక వచ్చింది. వచ్చే జనగణనలో కులగణన కూడా చేర్చుతామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయానికి తెలంగాణ కులసర్వేనే కారణం.’’
– రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి అడుగులు వేస్తున్నామని, ప్రపంచంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సిఎం రేవంత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ అజెండా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్టావ్రతరణ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని ఉద్ఘాటించారు. ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్‌ టేకుచి పాల్గొన్నారు. దేశాన్ని 30 ట్రిలియన్‌ ఎకానవిూగా తీర్చిదిద్దడం లో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే తెలంగాణ రైజింగ్‌-2047 భవిష్యత్‌ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్‌ ఎకానవిూగా తీర్చిద్దాలని నిర్ణయించాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ ఎకానవిూగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ రైజింగ్‌ మనల్ని నడిపించే మంత్రం. 2047నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వానికి విూరంతా అండగా ఉంటారని ఆశిస్తున్నానని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావమని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ రాష్టాన్న్రి పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. విద్యార్థులు,యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు… ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా… ఈ రోజు రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన సోనియా గాంధీగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నా..స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్నం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేసుకున్నారు. డిసెంబర్‌ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్టాన్న్రి గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలాం అని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్‌ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు- మహిళా శక్తి క్యాంటీ-న్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్‌ సిటీ- పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌,200యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీ లకు వీసీలను నియమించాం.యువతే మన భవిష్యత్తు… అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16 నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాం. అంతర్జాతీయ పెట్టు-బడులు రావడంతో ప్రైవేట్‌ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వైద్యరంగంలో, పోలీస్‌, నీటిపారుదల, సింగరేణి కాలరీస్‌, ఇలా వివిధ రంగాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నాం. సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు- చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం విశ్వసించాం. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్‌ను నియమించాం. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్‌ను ఆదేశించాం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్‌ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్‌లో మెస్‌ చార్జీల సమస్యను పరిష్కరించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్‌ చార్జీలను 40శాతం, కాస్మోటిక్‌ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణం చేపట్టాం అని వివరించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటు-న్నాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానం. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. శాస్త్రీయ్రంగా కులగణన నిర్వహించింది. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నాం. శాసనసభ, శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించు కున్నాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు-కుంది. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీని తెలంగాణ సోషల్‌ జస్టిస్‌ డేగా జరపాలని నిర్ణయించాం అని అన్నారు. సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. నిజమైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం. ఎంపిక చేసిన కొంతమందికి తొలి దశలో లక్ష రూపాయలు చెల్లించాం. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.53కోట్ల 64లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్నబియ్యం ఒక ట్రెండ్‌ సెట్టర్‌. తెలంగాణలో మూడు కోట్ల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది విప్లవాత్మక మార్పు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేను సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశా. ఆ రోజు వారి కళ్లలో చూసిన ఆనందం నా గుండెల్లో ఎప్పటికీ నిలిపోతుంది. పెట్టు-బడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్‌యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్‌, సింగపూర్‌, జపాన్‌ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్‌, మైక్రోసాప్ట్‌, హెచ్‌.సీ.ఎల్‌, కాగ్నిజెంట్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్‌లో ఇదొక తొలి మెట్టు అని వివరించారు. ప్రపంచ దేశాల నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందకు ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు వెల్లడిరచారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును చేపడుతున్నాం. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ-, స్పోర్ట్స్‌ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ సిటీలను ఏర్పాటు- చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్‌ సిటీ డెవలప్మెంట్‌ అథారిటీని ఏర్పాటు- చేశాం. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, నగరపోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

గన్పార్క్‌ వద్ద సీఎం నివాళి
` ముఖ్య అతిథిగా జపాన్‌ కితాక్యూషూ సిటీ మేయర్‌ కజుహిసా టకేచీ
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌ పార్క్‌ లో అమరవీరుల స్థూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. అవతరణదినోత్సవానికి వెళ్లే ముందు ఆయన నేరుగా గన్‌పార్క్‌ వెళ్లి స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపి అంజన్‌ కుమార్‌ యాదవ్‌, సిపిఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జపాన్‌ లోని కితాక్యూషూ సిటీ మేయర్‌ కజుహిసా టకేచీ, ఉన్నతాధికారులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీసు అధికారులకు మెడల్‌ ఫర్‌ గ్యాలెంట్రీ-, 11 మంది కి మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అందించారు. బహు భాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్‌ కు కాళోజీ పురస్కారం అందించారు.

తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది
` శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, అమిత్‌షా
న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ‘’తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది.ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘’దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఏన్డీయే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.‘’తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. గొప్ప సంస్కృతి, కష్టపడి పనిచేసే ప్రజలతో తెలంగాణ ప్రకాశిస్తోంది’’ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ’తెలుగు రాష్ట్రాలు వేరైనా.. తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు’’-ఏపీ సీఎం చంద్రబాబు

 

హైదరాబాద్‌-కితాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ
` ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తాం
` ఎకోటౌన్‌ మోడల్‌తో ప్రేరణ పొందాం
` మూసీ పునరుజ్జీవనకు అధిక ప్రాధాన్యం
` కిటాక్యూషు నగరాభివృద్ధిని పరిశీలించా
` జపాన్‌ ప్రతినిధి బృందంతో సిఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):కితాక్యూషు నగరం ఎకోటౌన్‌ మోడల్‌తో చాలా ప్రేరణ పొందినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జపాన్‌లోని కితాక్యూషు సిటీ మేయర్‌ కజుహిసా, జపాన్‌ బృందంతో ఐటీసీ కాకతీయలో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ, కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచ భాగస్వామ్యంతో రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నాం. కితాక్యూషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. తెలంగాణ-కితాక్యూషు సహకార ఒప్పందం జరగడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై మా దృష్టి ఉంది. రాష్ట్ర యువతకు నైపుణ్య కల్పించడం మా ప్రాధాన్యత. హైదరాబాద్‌-కితాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ-కి ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్‌ కిటాక్యూషు నగర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎలా నిర్మించబడుతున్నాయో వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కోసం, కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పాటు- చేయడమే మా లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. ఎప్రిల్‌లో జపాన్‌ను సందర్శించిన సమయంలో, కిటాక్యూషు నగర అభివృద్ధిని దగ్గర నుంచి పరిశీలించినట్లు- ఆయన తెలిపారు. ఎకో-టౌన్‌ మోడల్‌ నాకు గట్టిగా ప్రేరణనిచ్చింది. ఆ ప్రేరణతో హైదరాబాద్‌లో కూడా అలాంటి మోడల్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం అన్నారు. ఈ దిశగా ఇప్పటికే అనేక జపనీస్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ ఒప్పందాలు సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాల లక్ష్యం, పట్టణ ఆవిష్కరణలలో భాగస్వామ్యానికి పునాది కానున్నాయి. సీఎఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కిటాక్యూషు-తెలంగాణ సహకార ఒప్పందంపై ఈ రోజు సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రం ప్రస్తుతం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేంద్రీకృత దృష్టితో పనిచేస్తోందని చెప్పారు. అలాగే, తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. మా విద్యార్థులు జపనీస్‌ భాష నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు. జపాన్‌లో అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారు. విూ సహకారంతో వారికి జపనీస్‌ నేర్పించే అవకాశాలపై పని చేస్తాం అన్నారు. ఇక హైదరాబాద్‌, కిటాక్యూషు మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ- ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడిరచారు. విూ నగరం చూపిన నాయకత్వం అభినందనీయం. కిటాక్యూషు అభివృద్ధి నమూనా, తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. మన స్నేహం సుదీర్ఘంగా, అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కవులకు రూ.కోటి పురస్కారం
` తొమ్మిది మందికి నగదును సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి నగదును సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కా యాదగిరిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరికి నగదు పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్‌, బండి యాదగిరి తరఫున వారి కుటు-ంబసభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు.

 

మిస్‌వరల్డ్‌కు రాజ్‌భవన్‌లో తేనీటి విందు
హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రముఖులు
జనంసాక్షి:తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మిస్‌ వరల్డ్‌ పోటీ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌లో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి, మిస్‌ వరల్డ్‌-2025 ఓపల్‌ సుచాత చువాంగ్‌? శ్రీ, మొదటి రన్నరప్‌ హాసెట్‌ డెరెజే (ఇథియోపియా), రెండో రన్నరప్‌ మయా క్లైడా (పోలండ్‌), మూడో రన్నరప్‌ ఆరేలి జోచిమ్‌ (మార్టినిక్‌) సీఎస్‌, డీజీపీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, నిర్మాత దిల్‌ రాజు దంపతులు సహా పలువురు హాజరైయ్యారు.అనుభావాలను పంచుకున్న అందాల భామలు : అంతకు ముందు ఆదివాసీలతో కలిసి సుందరీమణు నృత్యం చేశారు. అనంతరం గవర్నర్‌ జిష్ణుదేవ్‌? వర్మను అందాల భామలు మర్యాదపూర్వకంగా కలిశారు. అందాల భామలు తమ తమ అనుభావాలను పంచుకున్నారు. తేనేటి విందు ప్రారంభానికి ముందు జాతీయగీతాలపనలో ప్రముఖులంతా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను అందరూ ముక్తకంఠంతో ఆలపించారు. దీంతో రాజ్‌?భవన్‌? వాతావరణం అంతా పండుగను తలపించింది.