అంతిమయాత్ర వెంట తరలిన లక్షలాది అభిమానులు

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకరే అంతిమ యాత్రలో పాల్గోనేందుకు లక్షలాదిగా కార్యాకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర సాగే మార్గాలన్ని జనాలతె కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్ర నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో నేతలు, అభిమానులు ముంబయి చేరుకున్నారు. అంత్యక్రియలు జరిగే శివాజీ పార్కు వద్ద తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర వెంట సుమారు 10 లక్షల మంది ప్రజలు తరలివెళ్తున్నాట్లు సమాచారం.