అక్రమంగా ఉగ్రవాదుల చొరబాటు
గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్రకు ఐబి హెచ్చరిక
న్యూఢిల్లీ,ఆగస్ట్20(జనం సాక్షి): గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్రకు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోకి నలుగురు వ్యక్తులు చొరబడినట్లు గుజరాత్ ఏటీఎస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేసింది. ఈ నలుగురు వ్యక్తులు ఆఫ్గానిస్థాన్ నుంచి గుజరాత్ తీరం ద్వారా దేశంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నెల మొదటి వారంలోని దేశంలోకి వారు చొరబడ్డారని తెలుస్తోంది. ఆగస్టు 15 నాడే దాడులకు పాల్పడొచ్చని ఐబీ భావించింది. నలుగురి ఛాయాచిత్రాలను స్థానిక పోలీసులకు ఐబీ అందించింది. వీరు ఏ క్షణంలోనైనా దాడులకు పాల్పడొచ్చని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. వాహన తనిఖీలు, నాకాబందీతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.