అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు : మన్మోహన్సింగ్
న్యూఢిల్లీ : పంట రుణాల మాఫీలో అక్రమాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్సింగ్ మాట్లాడుతూ పంట రుణాల మాఫీలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.