అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమత

కోల్‌కతా : కోల్‌కతా సూర్యసేన్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం మమత ప్రకటించారు.