అత్యంత ప్రజాకర్షణ గల నేత మోడీ : రాజ్నాథ్
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ ప్రశంసించారు. దేశరాజధానిలో ప్రారంభమైన భాజపా జాతీయ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భాజపాలో మరే ఇతర నేత కూడా ఇలాంటి ఘనత సాథించలేదన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్, రమణ్ సింగ్లు కూడా సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.