అత్యాచారయత్నం చేసి యువతిపై ఇనుప రాడుతో దాడి

న్యూఢిల్లీ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధానిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారాని యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గొంతులో ఇనుప రాడును దించి పారిపోయాడు. నిన్న సాయంత్రం లజ్‌పత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న యువతిని గమనించి పక్కనే నివాసముంటున్న ఎలక్ట్రీషియన్‌ తాగిన మైకంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించాడు. వెంటనే అమె ఓ ఇనుప రాడుతో అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ ఇనుపరాడును లాక్కొని ఆమె గొంతలో గుచ్చి అతను పారిపోయాడు. యువతి అరుపులతో చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.