అత్యాచారానికి గురైన బాలికను నాగపూర్ తరలించారు
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఘస్సోర్ పట్టణంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గత రాత్రి విమానంలో నాగపూర్ తరలించారు. 35 ఏళ్ల ఒక వ్యక్తి చాకొలెట్ ఆశ చూపి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానిక శ్మశానప్రాంతంలో వదిలివేశాడు. బుధవారం రాత్రి బాలిక అదృశ్యమయిందని, గురువారం ఉదయం ఆమెను శ్మశానం వద్ద కనుగొన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. బాలిక చికిత్స కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఘస్సోర్ పట్టణంలో స్థానికులు శనివారం పెద్దఎత్తున ఆందోళన జరిపారు. స్థానిక పవర్ప్లాంట్ యాజమాన్యం బాలిక చికిత్స ఖర్చు భరించడానికి ముందుకు వచ్చింది. నిందితుడి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు.