అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

విజయనగరం,నవంబర్‌1(జనంసాక్షి) : ఆర్‌టిసి బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం దత్తిరాజేరు మండలంలో చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం మరడాం సవిూపంలో ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి మర్రివలస జాతీయ రహదారి పక్కన ఉన్న కంసాల చెరువులోకి దూసుకెళ్లింది. విజయనగరం వైపు నుండి సాలూరు వైపుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 79 మంది ప్రయాణీకులున్నారు. బస్సులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చెరువు మట్టిలో కూరుకుపోయిన బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.