అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చౌరస్తాలో బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మట్టి వినాయకులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతియటా ఈ విధంగానే మట్టి వినాయకులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతుల వేణుగోపాల్, గోపీనాథ్, శ్రీనివాస్, రవి, సూర్య ప్రకాష్ తోపాటు వెంకన్న  కిరణ్ కుమార్, యుగంధర్, వైకుంఠం, వీరేంద్ర,  మోహన్, కన్నయ్య, సంతోష్, ప్రభాకర్, రమేష్ తదితరు పాల్గొన్నారు.