అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎస్‌ వర్మ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. నెల రోజుల్లోగా వర్మ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ నివేదిక అందిన అనంతరమే అన్నీ రాజకీయపక్షాలతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది.