అప్పు రాబట్టుకునేందుకు రాక్షసకాండ

చిన్నారి కళ్లుపీకి, కాళ్లు నరికి చంపివేత
రంగంలోకి దిగిన పోలీసులు..దుండుగుడి అరెస్ట్‌
లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): యూపిలోని అలీఘడ్ల్‌ఓ దారుణం జరగింది. తండ్రి అప్పుతీర్చలేదన్న కక్షతో ఓ ముష్కరుడు ఏకంగా రెండేళ్ల చిన్నారి కళ్లుపీకి,కాళ్లునరికి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
తండ్రి చేసిన అప్పుతీర్చలేదని కూతురి కళ్లు పీకి, కాళ్లు విరగొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన  ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన మే 30 న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..అలీఘడ్‌కు చెందిన జాహీద్‌ అనే వ్యక్తి రూ. 50 వేల అప్పు ఇచ్చాడు. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇప్పటి వరకు రూ.40 వేలు ఇవ్వగా, ఇంకా 10 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 10 వేల విషయంలో జాహీద్‌కు, అప్పు ఇచ్చిన వ్యక్తికి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జాహీద్‌ తన అనుచరుడు అస్లాంతో కలిసి అప్పు ఇచ్చిన వ్యక్తి కుమార్తె(2)ను మే 30వ తేదీన కిడ్నాప్‌ చేశాడు. ఆ మరుసటి తమ కుమార్తె అదృశ్యమైందని బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం అలీఘడ్‌ శివార్లలో చిన్నారి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మహిళ సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యతో సంబంధం ఉన్న జాహీద్‌, అస్లాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.