అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్ డివిజన్ పరిధిలో ఫతుల్లగుడా లో అభయాంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనుల గురుంచి  అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి ప్రశాంత్, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్  దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్   మాట్లాడుతూ ఎల్లపుడూ మీ అందుబాటులో ఉంటానని ఆలయ అభివృద్ధికి సహకారం  ఉంటుందని  హామీ ఇచ్చారు. అలాగే వీలైనంత త్వరగా పనులు ప్రారంభం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి ప్రశాంత్,సెక్యూరిటీ నవీన్,అశోక్ కుమార్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.