అమెజాన్ కార్యకలాపాలు ప్రారంభం
లాంఛనంగా ప్రారంబించిన ¬ంమంత్రి మహ్మూద్ అలీ
హైదరాబాద్,ఆగస్ట్21 (జనంసాక్షి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అమెజాన్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్ సంస్థను రాష్ట్ర ¬ంమంత్రి మహముద్ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహముద్ అలీ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ స్థిరాస్తి, వసతుల మేనేజర్ జాన్ స్కోట్లర్, ప్రభుత్వ ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. నానక్రామ్గూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్ ప్రపంచంలోనే అతిపెద్దది. 2016, మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అమెజాన్ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 అంతస్తులుగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఉద్యోగుల సంఖ్య పది వేలకు చేరుకోనుంది. హైదరాబాద్ క్యాంపస్ నుంచి అమెజాన్ అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించనుంది.