అసెంబ్లీ రద్దుపై కోర్టుకు వెళతాం: ముఫ్తీ
శ్రీనగర్,నవంబర్27(జనంసాక్షి): జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ రద్దుపై కోర్టుకు వెళ్లనున్నట్లు మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తెలిపారు. తాజా తీర్పు కోసం తాము ప్రజా కోర్టుకు వెళ్లడానికే సంసిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. శాసనసభ రద్దు చేయడంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని కొంతమంది నేతలు తనకు సూచించారని ముఫ్తీ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పిడిపి, ఎన్సి, ఐఎన్సిలు ఏకమయ్యాయని మహబూబా చెప్పారు. ప్రజా తీర్పు కోరడమే మంచిదని తన ఉద్దేశ్యమన్నారు.