ఆధార్ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక
న్యూఢిల్లీ : గ్యాస్ సబ్పిడీ కోసం ఆధార్ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థనను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఢిల్లీలో చెప్పారు. అక్రమాల నిరోధం కోసమే వంటగ్యాస్కు ఆధార్ అనుసంధానం చేశామని తెలిపారు. అయితే ఎక్కువ మందికి ఆధార్కార్డులు అందకపోవడంతో గడువు పొడగించాలని చమురు సంస్థలను ఆదేశించామన్నారు. కార్డుల జారీని త్వరతరగతిన పూర్తిచేయాలని కోరినట్లు చెప్పారు.