ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే

 ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాల మోత్కూర్ 1998-1999 సం.రంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని వైజే గార్డెన్ లో నిర్వహించారు.ఈ సమావేవానికి పుత్కనూరు స్రవంతి పూర్వ విద్యార్థి అధ్యక్ష్యత వహించారు. పాఠశాల కరెస్పాండంట్‌ సుధాగాని ముత్యాలు, కొణతం నాగార్జున రెడ్డి, పోన్నబోయిన యాదగిరి,రవీందర్ రెడ్డి,అరవింద రాయుడు లకు పూర్వ విద్యార్థులు సన్మానం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్‌ సుధాగాని ముత్యాలు,పి.యాదగిరి మాట్లాడుతూ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరు కనుకనే పూర్వ విద్యార్థులందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారని కొనియాడారు.అదే విధంగా ఉపాధ్యాయులు మదన్మోహన్,దుర్గాప్రసాద్ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అవలంభించాలని ఆశీర్వాదించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ప్రగతి ఉన్నత పాఠశాల గురించి ఎంతో గొప్పగా,వారి పూర్వ అనుభవాలను,అలాగే పాఠశాలలో చదుకోవడం వారు ఎంత పేరు ప్రఖ్యాతులు గంచారో గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.